బోగస్ చలాన్ల కుంభకోణం పై సీఎం జగన్ కీలక ఆదేశాలు

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సారిగా బోగస్ చలనాల కుంభకోణం బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోగస్ చలనాల కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే తాజాగా బోగస్ చలనాల కుంభకోణంపై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు.

అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీ పై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి  సూచనలు చేశారు. ఇప్పటి కే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించిన అధికారులు… సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్ లకు అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. అనుసంధానం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎం జగన్ కు వివరించారు అధికారులు. మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news