ఇక సీఎం కేసీఆర్ ఖ‌తం : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌తో పెట్టుకున్న కేసీఆర్ ప‌ని ఖ‌తం అవుతుంద‌ని రాజా సింగ్ అన్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌందర రాజ‌న్ పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీరు బాగ‌లేద‌ని మండిప‌డ్డారు. ఈ రోజు ప్ర‌ధాన మంత్రితో స‌మావేశం అయిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై దీని గురించి ఫిర్యాదు చేసి ఉండ‌చ్చ‌ని అన్నారు. రాజ్యాంగ బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉన్న త‌మిళిసైకి ప్రొటోకాల్ క‌ల్పించ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని అన్నారు.

అలాగే దేశ చ‌రిత్ర‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా.. బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌ని విమ‌ర్శించారు. అలాగే రాష్ట్రంలో గంజాయి, డ్ర‌గ్స్ అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు దమ్ముంటే.. డ్ర‌గ్స్ విక్రయిస్తున్న వారిని ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని స‌వాల్ విసిరారు. అలాగే డ్ర‌గ్స్ కేసుల‌తో సంబంధం ఉన్న న‌టీ న‌టుల‌ను మంత్రి కేటీఆర్ కాపాడుతున్నాడ‌ని ఆరోపించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌బ్‌లు, బార్లు అధికార పార్టీకి చెందిన కీల‌క నేత‌లే న‌డిపిస్తున్నార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news