తనపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని వేడుకున్న రాశి ఖన్నా..!

-

సౌత్ ఇండియా దెబ్బకు దిగి వచ్చిన రాశి ఖన్నా.దక్షిణాది సినీ పరిశ్రమ పై హీరోయిన్ రాశి ఖన్నా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.దక్షిణాది సినిమాలు రొటీన్ గా ఉంటాయని, హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాలలో మాత్రమే కనిపిస్తుందని తర్వాత కనుమరుగవుతుందని ఆమె అన్నారు.దక్షిణాదిలో హీరోయిన్ కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవని చెప్పారు.బాలీవుడ్ లో తనకు మంచి పాత్రలు వస్తున్నాయని, ఇకపై తనలో కొత్త నటిని చూస్తారని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు మండిపడ్డారు.హీరోయిన్ గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిన దక్షిణాది సినీ పరిశ్రమని విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు.బాలీవుడ్లో అవకాశాలు రాగానే సౌత్ ఇండస్ట్రీ చులకన అయిందా అంటూ నిప్పులు చెరిగారు నెటిజన్లు. దీంతో అమ్మడు దిగివచ్చింది.దక్షిణాది చిత్ర పరిశ్రమను తాను దూషించానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాశిఖన్నా చెప్పుకొచ్చింది. ఏ చిత్ర పరిశ్రమ అయినా తను చేసే ప్రతి సినిమాపై తనకు ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయని, తనపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆపాలని వేడుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news