ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ప‌ర్య‌టించ‌నున్న సీఎం జ‌గ‌న్‌..

-

ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఏపీలో `రచ్చబండ` తరహా కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం పని తీరు గురించి నేరుగా ప్రజలను అడిగి ఆయన తెలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో జగన్ సమీక్షించారు. గ్రామాల్లో పర్యటించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

అయితే త్వరలో శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమానికి `రచ్చబండ` అనే పేరును ఖరారు చేస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో రెండోసారి సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హెలికాఫ్టర్ లో వెళుతున్న సమయంలో సంభవించిన ఘోర ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news