కాంగ్రెస్ భారీ సభ… రాహుల్ గాంధీకి ఆహ్వానం…?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం చేయడానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

త్వరలోనే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేయనుంది. అయితే వారం రోజుల్లో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి భారీగా జనసమీకరణ కూడా చేయాలి అని రేవంత్ రెడ్డి జానారెడ్డి వంటి నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. అన్ని మండలాల వారీగా జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై నివేదిక కూడా తెప్పించుకున్నారు.

అక్కడి ప్రజల్లో ఆయనపై సానుభూతి ఎక్కువగా ఉంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎంతగానో అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ఆయనను మరోసారి గెలిపించుకునే బాగుంటుంది అనే భావన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఇక జానారెడ్డి ఇక్కడ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news