జగన్ మనిషివా రాక్షసుడివా…?; మహిళా నేత తీవ్ర విమర్శలు…!

-

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు వేలాది మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల ముందు బారులు తీరారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఈ విధంగా మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విపక్షాల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సిఎం వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నువ్వు మనిషివా రాక్షసుడివా ? ఏంటి ఈ పైశాచికత్వం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. కమీషన్లకు కక్కుర్తిపడి , మద్యం రేట్లు పెంచి , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావని ఆమె మండిపడ్డారు. పేదవాడి కడుపు కొట్టి , నీ జేబు నింపుకునే ప్రయత్నం ఆడవాళ్ళ ఉసురు పోసుకోకని జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ చెయ్యటం వలన…

ప్రజలు భౌతిక దూరం పాటించకుండా , పోలీసులు కంట్రొల్ చెయ్యలేక కరోనా వైరస్ బారిన పడితే రాష్ట్ర ప్రభుత్వానిదే నైతిక బాధ్యత అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చి కరోనా వైరస్ వల్ల భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మహిళలపై కేసులు పెట్టారని ఆమె మండిపడ్డారు. అదే రాజధాని ప్రాంతంలో మద్యం షాపుల ముందు,

భౌతిక దూరాన్ని పాటించకుండా ప్రజలు బారులు తీరారన్న ఆమె… ఇది పుర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. పేదవాడి ఆకలి తీర్చటానికి , అన్నం పెట్టిన ప్రతిపక్షాల పైన కేసులు పెట్టారు ఇది ఎక్కడి న్యాయం ? అని ఆమె నిలదీశారు. ముఖ్యమంత్రి గారు శవాల మీద చిల్లర ఏరుకునే ప్రయత్నాలు మానాలని పద్మశ్రీ హితవు పలికారు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు మద్యం షాపులు తెరవ కూడదని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news