బ్రేకింగ్: రేవంత్ రెడ్డి అరెస్ట్

-

భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను నిండా ముంచాయి. రైతులు అయితే దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోయారు అనే చెప్పాలి. ఈ వర్షాల తీవ్రత కారణంగా ఎందరో రైతులు అప్పుల పాలు అయ్యారు. ఇక అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. ఎల్లూరు వద్ద నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌజ్ పరిశీలను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి బయల్దేరి వెళ్ళారు.

మార్గమధ్యలో తెక్కపల్లి వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఆ సమయంలో వాహనాలు దిగడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. దీనితో పోలీస్ లు, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనితో ఎంపీ రేవంత్ రెడ్డి సహా… ఇతర కాంగ్రెస్ నేతలు సంపత్, మల్లు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news