రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై ఈట‌ల క్లారిటీ!.. ఆ ఫొటో దేనికి సంకేతం?

-

ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయాలు ఎవ‌రికీ అంతు చిక్క‌కుండా ఉన్నాయి. ఆయ‌న ఏదైనా పార్టీలో చేర‌తారా? లేదా కొత్త పార్టీ పెడ‌తారా అనేది ఎవ‌రికి తెలియ‌ట్లేదు. ఆయ‌న ఏ పార్టీలో చేర‌నంటూ, పార్టీ కూడా పెట్ట‌బోనంటూ ఇప్ప‌టికే చెప్పారు. అయితే అది కేవ‌లం బ‌య‌టి వారికి త‌న వ్యూహం తెలియ‌కుండా ఉండేందుకేన‌ని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ఆయ‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్రొఫైల్ గా నిన్న పెట్టిన ఫొటో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అది కొత్త పార్టీ పెడుతున్న‌ట్టు ఇంటిమేష‌న్ ఇస్తోంద‌ని కొంద‌రు అంటే.. లేదు మ‌ద్ద‌తు కోస‌మే అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

మెడ‌లో బ్లూ క‌లర్ కండువా, వెన‌కాల ఉద్య‌మానికి ప్ర‌తీక‌గా తెలంగాణ ప‌ఠంలో పిడికిలి, అంబేడ్క‌ర్‌, జ్యోతిరావు పూలే, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఫొటోలుఉన్నాయి. అలాగే తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం, ఉద్య‌మాల ఉనికి కోసం అమ‌రుల స్థూపం ఉంది. ఇవ‌న్నీ చూస్తుంటే ఆయ‌న ఆర్ ఎస్‌యూ నుంచి ఆర్ ఎస్ ఎస్ వ‌ర‌కు అంద‌రినీ క‌లుపుకుని పోతా అని చెప్పిన మాట‌ల‌కు నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. అంటే అంద‌రి మ‌ద్ద‌తు కోరుతూ అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ర్షించే విధంగా ఆ ఫొటో పెట్టార‌న్న మాట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version