గుంటూరు: గవర్నర్ వ్యవస్థకే నరసింహన్ కళంకం తెస్తున్నారని మంత్రి నక్కా ఆనంద్బాబు ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, జనసేన, టీఆర్ఎస్కు గవర్నర్ మధ్యవర్తిలా వ్యవహరిస్తున్నారని గుంటూరులో మీడియా సమావేశంలో విమర్శించారు. పోలీసు వ్యవస్థను జగన్ కించపర్చారన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలను జగన్ అవమానించారని తెలిపారు. ఏపీకి సీఎం కావాలని ఆరాటపడే వ్యక్తికి ఇక్కడి వ్యవస్థలపై నమ్మకం లేదా ? అని అడిగారు. అయినా జగన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
గవర్నర్ వ్యవస్థకే కళంకం: నక్కా ఆనంద్బాబు
By Anil Kumar
-
Previous article
Next article