వీర జవాన్లకు కేటీఆర్ నివాళులు.. 25 లక్షల ఆర్థిక సాయం..!

-

పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నివాళులర్పించారు. బంజారాహిల్స్ లోని సీఆర్పీఎఫ్ సదరన్ హెడ్ క్వార్టర్స్ లో అమర జవాన్లకు నివాళులు అర్పించిన అనంతరం.. ఆయన ఐజీపీ రాజును కలిసి.. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి తన వంతు సాయం రూ.25 లక్షలు అందించారు.

ఆయన ఇచ్చిన 25 లక్షలతో పాటు… తన స్నేహితులు ఇచ్చిన మరో 25 లక్షల రూపాయల చెక్కును కూడా కేటీఆర్.. ఐజీపీకి అందించారు. ఒక సాధారణ భారత పౌరుడిగా తాను ఇక్కడికి వచ్చానని.. జవాన్ల వల్లనే దేశ ప్రజలంతా క్షేమంగా, ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు. వారి త్యాగలను మనం ఎన్నడూ మరవకూడదన్నారు. జవాన్ల మరణం తనను చాలా కలచి వేసిందన్నారు. ఈసందర్భంగా అమర జవాన్లకు నివాళిగా కేటీఆర్ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version