వేడెక్కుతున్న క‌ర్నూలు రాజ‌కీయాలు.. ఆ ఎమ్మెల్యేపై జంట హ‌త్య‌ల ఆరోప‌ణ‌లు!

-

ఏపీలో సంచ‌ల‌న సృష్టించిన టీడీపీ నేత‌ల జంట హ‌త్య‌ల చుట్టూ రాజ‌కీయం వేడెక్కుతోంది. ఈ హ‌త్య‌ల‌పై టీడీపీ భ‌గ్గుమంటోంది. మామూలుగానే రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఈ హ‌త్యారాజ‌కీయాలు చాలా కామ‌న్‌. ఇక ఇప్పుడు జ‌రుగుతున్న హ‌త్యలు అయితే అగ్గిని రాజేస్తున్నాయి. అయితే పాణ్యంలో జ‌రిగిన ఈ హ‌త్య‌ల‌పై నారా లోకేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

 జంట హ‌త్య‌ల

హ‌త్య‌కు గురైన టీడీపీ నాయ‌కులు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డికి నివాళి అర్పించేందుకు నారా లోకేష్ ఈరోజు పాణ్యం వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డికి ఈ హ‌త్యల వెన‌క హ‌స్తం ఉంద‌ని ఇప్ప‌టికే వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు లోకేష్ వ్యాఖ్య‌లు ఆజ్యం పోశాయి.

జ‌గ‌న్‌కు ధైర్యం ఉంటే సీబీఐతో ఎంక్వ‌యిరీ వేయించాల‌న్నారు. స్థానికంగా ఉన్న ఓ కుక్క బాగా మొరుగుతోంద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు నారా లోకేష్‌. అయితే ఈ కామెంట్ల‌తో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఫైర్ అవుతున్నారు. నిజాలు తెలియ‌కుండా మాట్లాడుతున్నారంటూ భ‌గ్గుమంటున్నారు. కాట‌సాని రాంభూపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని చెబుతున్నారు. కానీ దీనిపై కాట‌సాని మాత్రం ఇంకా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news