టీడీపీకి మరో షాక్…. వైసీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మాగుంట..!

-

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఏపీలో ఏకపక్షంగా టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైస్సార్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడట. ఆయన త్వరలోనే టీడీపీకి బై బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నాడట. ఇప్పటికే ఆయన జగన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ స్థానానికి తాను చెప్పిన వారికి కాకుండా వేరే వారికి ఇస్తామంటూ టీడీపీ అధిష్ఠానం అంటుండటం తో మనస్తాపం చెందిన మాగుంట వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version