కొన్ని మీడియా చానల్స్ డ్రామా ఆడాయి: హోం మంత్రి ఫైర్

-

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసు ఏమో గాని ప్రతీ రోజు ఏదోక పరిణామం ఇందులో చోటు చేసుకుంటూనే ఉంది. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి తీవ్ర స్థాయిలో మీడియా సంస్థలు, బిజెపిపై మండిపడ్డారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్… సుశాంత్ మరణ కేసు వివాదాల గురించి మాట్లాడుతూ… “సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుని పరిశీలించిన ఎయిమ్స్ కు చెందిన ఏడుగురు సీనియర్ వైద్యులు పరిశీలించగా ఎలాంటి నాటకం లేదని అర్ధమైందని స్పష్టం చేసారు.

“సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో, బిజెపి ఒక కుట్రను సృష్టించిందని, ఇందులో కొన్ని మీడియా ఛానెళ్లు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పరువు తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. మహారాష్ట్ర మరియు ముంబై పోలీసులు… తన పనిని చక్కగా చేసారు, ఇది సుప్రీంకోర్టు ఆదేశంలో కూడా స్పష్టంగా ఉంది.” అని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news