చంద్రబాబుకు స‌వాల్ విసిరిన మంత్రి అనిల్‌..!

-

గ‌త రెండు రోజుల క్రితం వైసీపీ నేత, జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు హయాంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ప్రాజెక్టు అయినా నిర్మించారా అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. అంతేకాకుండా దమ్ముంటే చంద్రబాబు నాయుడు ఈ విషయానికి సమాధానం చెప్పాలని మంత్రి అనిల్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు. ఇక తాజాన ఈయ‌న మ‌రోసారి చంద్ర‌బాబుకు స‌వాల్ విసిరారు.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వదిలేసి..మరో పార్టీ పెట్టి పోటీకి రండి అంటూ సవాల్ విసిరారు. అభిమానంతో ఓట్లు పడుతున్నాయి తప్ప చంద్రబాబును చూసి కాదన్నారు. చంద్రబాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులు.. తాము మంత్రి కంటే ముందు సీఎం జగన్ భక్తులమని చెప్పారు. జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడని అనిల్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news