సొంత‌గూటికి ఎమ్మెల్యే ఆదిమూలం.. వైసీపీ లెక్క మారుతోందిగా

-

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సొంత గూటికే వ‌చ్చేస్తున్నారా అంటే అవున‌నే అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.టీడీపీ నుంచి స‌స్పెండ్ అయ్యాక తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆదిమూలం బిజెపిలో చేర‌తార‌నే టాక్ న‌డిచింది.కానీ ఆయ‌న మాత్రం వైసీపీలోకి వెళ్ళ‌బోతున్నార‌ని తెలుస్తోంది. తెలుగుదేశం మహిళా నాయకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు.ఎన్నికలకు ముందే ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మూడు నెలలు గడవకముందే టీడీపీకి ఆయ‌న దూరమయ్యారు. అయితే కనీసం తనకు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇంత జరిగాక పార్టీలో కొనసాగడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు.అందుకే తిరిగి వైసీపీలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.\

ఎమ్మెల్యే ఆదిమూలం త‌న‌పై లైంగికంగా దాడి చేశారని ఆరోపిస్తూ టిడిపి నాయకురాలు నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా బయటపెట్టారు.సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించిన వీడియోలను ఆమె అందించారు.దీంతో మారు మాట లేకుండా టిడిపి హై కమాండ్ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే దీనిని ఆదిమూలం కుటుంబ సభ్యులు, అనుచరులు తప్పుపడుతున్నారు. కనీసం నోటీసు ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. డీఎన్ఏ ను పరిశీలిస్తున్నారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఏకంగా పార్టీకి చెందిన ఒక నాయకురాలు తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పడంతో హై కమాండ్ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేతలపై లైంగిక ఆరోపణలు వచ్చి ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో వెనువెంటనే టిడిపి ఈ ఘటనపై స్పందించింది. చర్యలకు ఉపక్రమించింది.అయితే టిడిపి అధిష్టానం వ్యవహరించిన తీరుతో ఎమ్మెల్యే ఆదిమూలం మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.కనీసం తన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా కనీసం విచారణ చేపట్టకుండా.. తాను తప్పు చేశానని నిర్ధారించి పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.

ఆదిమూలంకు టిడిపిలో సైతం మద్దతు లభించలేదు.ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు సన్నిహిత బిజెపి నేతల ద్వారా ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేసిన‌ట్లు తెలిసింది.కానీ ఆయ‌న వైసీపీలోకి వెళ్ళాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు.ఆదిమూలంపై వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మంచి అభిప్రాయం ఉంది.వ్య‌క్తిగ‌తంగా ఆదిమూలంను జ‌గ‌న్ అభిమానిస్తారు.దీంతో పార్టీలో చేర్చుకుంటార‌నే ఆశిస్తున్నారు ఆదిమూలం.త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌ను క‌లిసి వైసీపీ ఖండువా క‌ప్పుకోనున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్తున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే వైసీపీ ఖాతాలో మ‌రో సీటు పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version