‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’.. ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యలపై దుమారం

-

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు.. అంటూ ఆయన దళితులను దూషించిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్ క్యాస్ట్ వారంటూ తన ఇష్టమొచ్చినట్లు దళితులను తిట్టినట్లు ఆ వీడియోలో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన గత నెలలో జరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలోని శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మాట్లాడిన చింతమనేని దళితులను దూషించినట్లు తెలుస్తోంది.

ఈ వీడియోపై స్పందించిన దళిత సంఘాలు, వైసీపీ నేతలు… దళితులను దూషించిన చింతమనేనిపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరులో ధర్నా చేశారు. టీడీపీ హైకమాండ్ చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version