ఎంత కోపం  చూపించినా – ఎమ్మెల్యే రోజా బంగారం … ఇదొక్కటీ చాలు !!

-

వైసిపి పార్టీ ఎమ్మెల్యే రోజా కి రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ అనే బిరుదు ఉంది. ప్రత్యర్ధి పార్టీ నాయకులను ఏకిపారేసిన లో మీడియా సమావేశాల్లో అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యర్థులపై విరుచుకు పడటం లో రోజా కి మించిన వారు వైసీపీ పార్టీలో లేరని చాలా ఎగ్రెసివ్ పర్సన్ అంటూ రోజా కి చాలా కోపం ఉంటుందని చాలా మంది రాజకీయ నాయకులు అదేవిధంగా బయట కూడా కామెంట్ చేస్తుంటారు. దీంతో ఆమె ఇటీవల చేసిన ఒక పనికి రోజా చాలా బంగారం అని దానికి నిదర్శనం ఇదొక్కటి చాలు అంటూ సోషల్ మీడియాలో రోజా గురించి ఆమెకు సంబంధించిన మద్దతుదారులు పోస్ట్ పెట్టారు.

Image result for mla roja

మేటర్ లోకి వెళ్తే ఆమె ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బైక్ డ్రైవ్ చేసిన రోజా బైక్ పై తన వెనకాల తన కొడుకుని కూర్చోబెట్టుకుని హెల్మెట్ ధరించి ప్రజలలో అవగాహన కల్పించే విధంగా చేపట్టిన ర్యాలీ చూపరులను అదేవిధంగా పుత్తూరు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. హెల్మెట్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి జరిగిన ఈ ర్యాలీలో హెల్మెట్ కి మరియు కుటుంబానికి ఉన్న సంబంధాన్ని చిన్న జాగ్రత్తలు చెప్పి హెల్మెట్ పై అవగాహన ప్రజలకు కల్పించే విధంగా రోజా వ్యవహరించడం జరిగింది.

 

ఇదే ర్యాలీలో మద్యం తాగి నడపటం వల్ల వచ్చే అనర్ధాలు కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో రోజా తెలియజేయడం జరిగింది. మొత్తంమీద హెల్మెట్ అవగాహన కార్యక్రమం కోసం తన కొడుకుని ర్యాలీలో తన బైక్ పై కూర్చోపెట్టుకొని రోజా వ్యవహరించిన తీరుకు రోజా బంగారం అని పుత్తూరు ప్రజలు అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news