సీఎం జ‌గ‌న్‌పై సినీ నటుడు సుమన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

-

ఈ రోజు సుమన్ గుంటూరు జిల్లా మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ మాజీ శాసన సభ్యుడు గౌతు లచ్చన్న కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని చెప్పారు.

రైతులకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు యత్నించానని… కానీ అపాయింట్ మెంట్ దొరకలేదని చెప్పారు. రాజధాని రైతుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కారించాలని డిమాండ్ చేశారు. భుత్వం మారినప్పుడల్లా కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజమని వ్యాఖ్యానించారు. ఇక అవకాశం కల్పిస్తే.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్ప‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news