టీడీపీ నేతలకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉద్యమం ఇప్పుడు తీవ్ర స్థాయిలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అమరావతి ప్రాంత రైతులకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాజధాని తరలింపుని అడ్డుకునే విధంగా చంద్రబాబు, తెలుగుదేశం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ సమావేశాలను అడ్డుకునే అవకాశం కనపడుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని మార్పుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో సమావేశాలను బాయ్ కాట్ చేయడంతో పాటుగా సమావేశాలను ఎలాగైనా సరే అడ్డుకోవాలని భావిస్తుంది తెలుగుదేశ౦. అయితే ఇక్కడ పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ఎక్కడిక్కడ రైతులను తెలుగుదేశం నేతలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇళ్ళకు నోటీసులు కూడా అంటించారు. అచ్చేన్నాయుడు, కేసినేని నానీ, బుద్దా వెంకన్న, బొండా ఉమా సహా పలువురు నేతలకు హెచ్చరికలు చేసారు. తెలుగుదేశం నేతలు మాత్రం సమావేశాలను జరగనిచ్చేది లేదని స్పష్టం చేయడంతో రేపు ఎం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news