టీవీ షోస్ కి రోజా గుడ్ బై…!

-

టీవీ షోస్ కి నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పెట్టింది పేరు. ఆమె షో లో ఉంటే ఆ షో కచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన అందరిలో ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఈటీవి లో వచ్చే జబర్దస్త్ షో కి జడ్జి గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని షోస్ కి కూడా ఆమె వ్యాఖ్యాతగా ఉన్నారు. ప్రస్తుతం మరో షో కి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు టీవీ షోస్ కి ఆమె దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో రోజా ఏపీఐఐసీ ఛైర్మన్ గా ఉన్నారు. త్వరలోనే ఆమె మంత్రి వర్గంలోకి కూడా చేరే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఇక మంత్రి వర్గంలో ఆమె చేరితే మాత్రం రోజాకు టైం ఉండే అవకాశం లేదు. అందుకే పార్టీలో ఉన్న కొందరు సీనియర్ నేతలు ఆమెను టీవీ షోస్ లో పాల్గొనవద్దు అని సూచించినట్టు సమాచారం. మంత్రిగా వెళ్ళాక అలాంటి షోస్ చేస్తే విలువ ఉండదు అని చెప్పారట.

దీనితో రోజా ఇప్పుడు వాటికి దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆమెను పిలిచి వాటికి దూరంగా ఉంటే మంచిది అని చెప్పినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి అని రోజాకు సూచించారట. నియోజకవర్గంలో సొంత పార్టీలోనే కుంపటి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అని రోజాకు సూచించారట.

Read more RELATED
Recommended to you

Latest news