అమ్మ త్రివిక్ర‌మో.. ఎంత ప‌నిచేశావ్‌.. `అల` క‌థ నీది కాదా..?

-

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విడుద‌లైన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా త్రివిక్రమ్ టేకింగ్‌కు అల్లు అర్జున్ నటన తోడై ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే తాజాగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లీగ‌ల్ నోటీసులు పంపిస్తాన‌ని కృష్ణ అనే దర్శకుడు తెలిపాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠ‌పుర‌ములో సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

2005లో త్రివిక్ర‌మ్‌ని క‌లిసిన కృష్ణ అల వైకుంఠ పురములో కథను చెప్పాడట. అంతేగాక, 2013లో ఈ క‌థ‌ని ఆయన ఫిలిం ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో త‌న స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజ్ కాపీని తాను దర్శకుడు త్రివిక్ర‌మ్‌కి ఇచ్చాన‌ని కృష్ణ అంటున్నాడు. అంతేకాకుండా నేను చెప్పిన క‌థని దశ‌-దిశ అనే టైటిల్‌తో తెరకెక్కించాల‌నుకున్నాన‌ని, కాని త్రివిక్ర‌మ్ నా క‌థ‌తో అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం తెర‌కెక్కించాడ‌ని ఆయన ఆరోపిస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్‌కు నోటీసులు పంపుతానని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news