రైతుల ముసుగులో టీఆర్ఎస్ నేత‌లే దాడి చేస్తున్నారు : ఎంపీ అర‌వింద్

-

త‌న‌పై టీఆర్ఎస్ నేత‌లే దాడులు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పూరి అర‌వింద్ ఆరోపించారు. రైతులు, నిరుద్యోగుల ముసుగులో టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే త‌న‌పై దాడులు చేస్తున్నార‌ని అన్నారు. త‌న‌పై ప్ర‌జ‌లు ఎందుకు దాడి చేస్తార‌ని ప్ర‌శ్నించారు. నిజామాబాద్ జిల్లాలో ప్ర‌స్తుతం నిర్మిస్తున్న సీసీ రోడ్లకు 90 శాతం నిధులు కేంద్రానివే అని అన్నారు. అంతే కాకుండా ప‌లు ర‌కాలుగా కేంద్రం నిధులు వ‌స్తున్నాయ‌ని అన్నారు. అలాంటి సమ‌యంలో త‌న‌పై ప్ర‌జ‌లు ఎందుకు దాడి చేస్తార‌ని అన్నారు.

అలాగే జిల్లాలోని ధ‌ర్ప‌ల్లి లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని.. టీఆర్ఎస్ నాయ‌కులు ఆవిష్క‌రించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. టీఆర్ఎస్ కు ప‌రాయి సోమ్మును తిన‌డం అల‌వాటు అయింద‌ని విమ‌ర్శించారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ క‌మలం విక‌సిస్తుంద‌ని అన్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించినా.. అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని అన్నారు. కాగ ధ‌ర్ప‌ల్లిలో టీఆర్ఎస్ నాయ‌కులు ఆవిష్క‌రించిన శివాజీ విగ్రాహాన్ని పాలతో శుద్ది చేసి తిరిగి ఆవిష్క‌రిస్తామ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version