ఏబీఎన్‌ రాధాకృష్ణపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ?

-

ఆంధ్రజ్యోతి మీడియా వైఎస్ జగన్ కు వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియం చదువులపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ఇస్తోంది. ఇది మత వ్యాప్తి కోసం జగన్ చేస్తున్న పని అనే అభిప్రాయం కలిగేలా కథనాలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై ఆ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏ స్టేజీ నుంచి ఏ స్టేజీకి ఎదిగారో అందరికీ తెలుసన్నారు. రాధాకృష్ణ ఎవరికి బినామీగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాధాకృష్ణ రాతలు దారుణంగా ఉన్నాయని నాగార్జున మండిపడ్డారు. పేదల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదువుకునేందుకు వైయస్‌ జగన్‌ అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు.

ఇటీవల మరో మంత్రి రాధాకృష్ణపై కేసులు వేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆంధ్రజ్యోతి మీడియా వైఎస్ జగన్ కు వ్యతిరేకమన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇప్పుడే కాదు వైఎస్ హయాం నుంచి ఆంధ్రజ్యోతి మీడియాకు వైఎస్ కుటుంబానికి గొడవ ఉంది. వైఎస్ హయాంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చాలా సవాళ్లు విసిరారు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించారు.

ఇప్పుడు జగన్ సీఎం అయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి కలం మరింతగా పదునెక్కుతోంది. చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని, అసలు ఆయన జ్ఞానినో, అజ్ఞానినో తేల్చుకోవాలని నాగార్జున అన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలాడిస్తున్నారని, అవాక్కులు, చవాక్కులు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news