గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ ఉండరన్న వైసీపీ ఎంపీ…!

-

సాధారణంగా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్ధులను విమర్శించే క్రమంలో కాస్త అతిగా వ్యాఖ్యలు చేయడం అనేది సర్వ సాధారణమైన విషయం. రాజకీయంగా బలంగా ఉన్న నేతలు అయితే, కాస్త డోస్ పెంచి యేవో విమర్శలు చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయంలోనే కొందరు పప్పులో కాలేస్తూ ఉంటారు. ప్రత్యర్ధులను విమర్శించాబోయి తమను తాము విమర్శించుకుంటూ ఉంటారు.

మైక్ దొరికితే చాలు కొందరు రెచ్చిపోయే ప్రయత్నాల్లో ఉంటారు. ఇలా పప్పులో కాలేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారిలో వైసీపీ నేతల జాబితా ఎక్కువగా ఉంది. అంబటి రాంబాబు, మంత్రులు కొందరు ఇలా మాటలు తడబడుతూ ఉంటారు. వారిలో తాజాగా ఒక ఎంపీ గారు చేరిపోయారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది.

ఈ ర్యాలీలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. వైసీపీలో చేరేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అని విలేఖర్లు ప్రశ్నించగా గేట్లు తెరిస్తే వైసీపీలో ఎవరూ మిగలరనగా వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు టీడీపీ అనడంతో, తిరిగి వైసీపీకి అనుకూలంగా సీఎం జగన్ గేట్లు తెరిస్తే టీడీపీలో ఎవరూ మిగలరన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news