వైఎస్ షర్మిల కేసు.. యువకుడి అరెస్ట్

-

గత కొన్నిరోజులుగా వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై షర్మిల ఇదివరకే హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేశారు. మరి కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించారు.

తాజాగా ఏపీకి చెందిన వెంకటేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు షర్మిలపై అసభ్యకర పోస్టులు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్టు తేలింది. దీంతో అతడిపై సెక్షన్ 509, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ వ్యక్తి షర్మిల గురించి ఏ పోస్టులు షేర్ చేశాడో పోలీసులు తెలుసుకుంటున్నారు. వెంకటేశ్వర్ ఓ పార్టీకి పని చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version