BRS నేతలకు సవాలు విసురుతున్నా… : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ తో సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి జులై 2వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కేసీఆర్ రెండు సార్లు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని దక్కించుకున్నారని.. ఇప్పుడు మూడవ సారి మళ్ళీ మాయ చేయడానికి రెడీ అయ్యాడని.. ఈ దపా మాత్రం ఎవ్వరూ కేసీఆర్ మాటలకు మోసపోవద్దు అని కోరుకున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరుతున్నాం అంటూ ప్రకటించాడు. కేసీఆర్ పెట్టిన సభకు మించి అతి పెద్ద సభను పెట్టనున్నామని… BRS నేతలు అందరికీ సవాలు విసురుతున్నా మీ సభకు ఎంతమంది వచ్చారో…. నా సభకు ఎంతమంది వస్తారో చూసి అప్పుడు మాట్లాడండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు పొంగులేటి.

మరి పొంగులేటి చేసిన సవాల్ లో గెలుస్తాడా అన్నది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news