ఆ సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో పూజా హెగ్డే..!!

-

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.ఈ ముద్దుగుమ్మ కి గత ఏడాది వరుసగా ప్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి.

అయినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలోనే గట్టిగా డిమాండ్ చేస్తోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్, రామ్ చరణ్ తో నటించిన ఆచార్య, విజయ్ దళపతి తో చేసిన బీస్ట్ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. అలాగే బాలీవుడ్లో వచ్చిన సర్కార్ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే కార్తీ నటించిన ఆవారా సినిమా సీక్వెల్లో ఈమె నటించబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వం వహించారు. ఒకవేళ ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయితే కచ్చితంగా ఈమెకు ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోగా తమిళ హీరో ఆర్య చేస్తున్నట్లుగా సమాచారం. ఇందులో ఈమె కథానాయక ఎంపికైందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూజ హెగ్డే సినిమాల కెరియర్ విషయానికి వస్తే మహేష్ బాబు నటిస్తున్న 29వ సినిమాల హీరోయిన్గా ఎంపిక అయింది . ఈ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ తరాకెక్కిస్తూ ఉన్నారు. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news