ఇండియాకు మరో షాక్ : క్వార్టర్ ఫైనల్స్‌లో పూజా రాణి ఓటమి

-

టోక్యో ఒలంపిక్స్ లో… శనివారం అస్సలు అచ్చి రానట్టే కనిపిస్తూ ఉంది. భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ తొలి మ్యాచ్లోనే ఓటమి చెందగా… ఈసారి ఎలాగైనా మెడల్ తీసుకువస్తుందని ఆశపడిన పూజా రాణి క్వార్టర్ ఫైనల్స్ లో ఘోర పరాజయ పాలైంది. 69 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన లీ కియాన్ తో జరిగిన మ్యాచ్ లో లో 0-5 తేడాతో ఓడింది పూజా రాణి.

అంతకుముందు మెన్స్ బాక్సింగ్ లో లో 52 కేజీల విభాగంలో టాప్ బాక్సర్ అమిత్ పంగల్ రెండో రౌండ్ లోనే ఓడి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక అటు టోక్యో ఒలంపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. చైనాకు చెందిన తైజు చేతిలో పీవీ సింధు ఓడిపోయింది. వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి… తైజు చేతిలో…. వరుస సెట్లలలో పీవీ సింధు నిరాశపరిచింది. 18-21 మరియు 12-21 తేడాతో పీవీ సింధు ఘోరపరాభవం చవిచూసింది.

Read more RELATED
Recommended to you

Latest news