ఈటెల రాజేందర్ ను కలిసిన పూనమ్ కౌర్.. వీడియో వైరల్ !

-

ముగ్ధ మనోహర రూపంతో ముద్దుగా ఉంటుంది పూనం కౌర్. అడపాదడపా సినిమాల్లో ఆఫర్లు వచ్చినా అంతకంటే ఎక్కువ పబ్లిసిటీని సంపాదిస్తుంది ఈ భామ. తనకు సంబంధం లేని ఇష్యూ లో కూడా తన పేరు ప్రస్తావిస్తూ ఉంది. పూనం కౌర్… అవడానికి పంజాబీ అమ్మాయి అయినా హైదరాబాదులో పుట్టి పెరిగింది. ప్రస్తుతం సినిమాలు నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

అయితే తాజాగా పూనమ్ కౌర్.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళింది. గురునానక్ జయంతి సందర్భంగా ఈటెల రాజేందర్ ను కలిసింది పూనమ్ కౌర్. ఈ సందర్భంగా పావురాలను ఈటెల రాజేందర్ తోపాటు పూనమ్ కౌర్ ఎగుర వేసింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ తో పాటు బిజెపి నాయకులు ఉన్నారు. కాగా అక్టోబర్ 30వ తేదీన జరిగిన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news