మల్లారెడ్డి మాట్లాడుతుండగా పవర్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు..!

-

మల్లారెడ్డి మాట్లాడుతుండగా పవర్ కట్ అయ్యింది. వివరాలను చూస్తే.. నాగారం దమ్మాయిగూడ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ టైం లో అక్కడ కరెంట్ పోయింది. అలానే అదే సమయం లో దమ్మాయిగూడ దగ్గర డీఈ భాస్కర్ రావు, సర్కిల్ ఎస్ఈ పెర్మిషన్ లేకుండా ఎల్సీ ఇచ్చాడు.

అయితే దీంతో ఆ రోజు ఉదయం 10:05 నుండి 10:35 వరకు అర్ధగంట విద్యుత్ ఆగిపోయింది.. దీనిపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎల్సీ తీసుకోవడం మీద కీసర డీఈ భాస్కర్ రావు పై సస్పెన్షన్ వేటు వేశారు. అలానే నాగారం ఏఈఈ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని TSSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news