రాధేశ్యామ్: ఇందిరాగాంధీని కలవనున్న ప్రభాస్..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తన చేతిలో నాలుగు సినిమాలు పెట్టుకున్నాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని సినిమా, కేజీఎఫ్ దర్శకుడి దర్శకత్వంలో రూపొందనున్న సలార్. ఈ నాలుగు సినిమాలతో మరో ఐదేళ్ళపాటు బిజీగా ఉన్న ప్రభాస్, తన తర్వాతి చిత్రం రాధేశ్యామ్ సినిమాలో ఆసక్తికరమైన సన్నివేశంలో కనిపించనున్నాడు. రాధాక్రిష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాధేశ్యామ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఒక పాత్ర పీరియాడిక్ గా ఉంటే మరో పాత్ర ప్రస్తుత తరానికి సంబంధించినదిగా ఉంటుందట.

పీరియాడిక్ పాత్రలో ప్రభాస్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కలవనున్నారట. ఇటీవలే ఈ సీన్ కి సంబంధించిన సీన్ ని చిత్రీకరించారట. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మాజీ ప్రధానిని ఎందుకు కలవనున్నారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఒకస్థాయిలో ఉన్న అంచనాలు, మాజీ ప్రధానిని కలిసే సీన్ ఉందని తెలిసిన తర్వాత మరింత పెరిగాయనడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news