అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

-

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ కు జ్వరం వచ్చిందని దీంతో ఇప్పటికే కన్ఫర్మ్ చేసినా ఆయన సినిమా షూటింగ్స్ షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఈ నెలలో పీపుల్ మీడియా మూవీ ప్రారంభించాల్సి ఉందని ..కానీ ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ ను క్యాన్సిల్ చేశారని సమాచారం.

అనారోగ్యంతో ఉండడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారట.. అయితే అభిమానులు అంతలా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని కూడా చెబుతున్నారు. ఇటీవలే రాదేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ మూటగట్టుకున్న కూడా ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టి దూసుకుపోతున్నారు. ప్రభాస్ లైనప్ సినిమాల కోసం ఆయన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకపక్క ఆయన పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి.

తాజాగా మరో వారం రోజుల్లో ప్రభాస్ , కృతి సనన్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని అది కూడా మాల్దీవుల్లో ప్రత్యేకమైన అతిధుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట బాగా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదు. మరొక పక్క ఆయన ఆరోగ్య విషయంపై కూడా ఇలాంటి రూమర్లు వస్తున్న నేపథ్యంలో అభిమానులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ వీటన్నింటిపై స్పందిస్తే.. అభిమానులు కాస్త ఊరట పడతారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version