విపక్షాల తిట్లే 2024 లో ఘనవిజయానికి ఆశీర్వాదాలు : ప్రధాని మోదీ

-

కాసేపటి క్రితం పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ అవిశ్వాస తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని విపక్షాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. విపక్షాలలో అహంకారం మరియు అవిశ్వాసం నరనరాల్లో నిండి పోయాయంటూ మోదీ కామెంట్ చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా ప్రభుత్వంపై పనికట్టుకుని మరీ తిడుతున్నారు అంటూ ఆవేదన చెందారు. కానీ వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే … విపక్షాల తిట్లే మాకు ఆశీర్వచనాలు అంటూ మోదీ చాలా పాజిటివ్ గా తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు. ఇంకా మీరు ఎంత వ్యతిరేకతను ప్రజలలో కలిగించాలి అనుకున్నా అంతటి ప్రేమను వచ్చే 2024 ఎన్నికల్లో ప్రజలు మాపై కురిపించి మళ్ళీ అధికారాన్ని కట్టబెడుతారంటూ మోదీ మాట్లాడారు.

ఇంకా ఈ ప్రసంగంలో మోదీ కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీ పై విమర్శల వర్షాన్ని కురిపించారు. ఇంకా ఈ ప్రసంగంలో మోదీ కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీ పై విమర్శల వర్షాన్ని కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news