గంగూలీతో కలిసి ఆడిన క్రికెటర్.. ప్రస్తుతం పానీపూరి వ్యాపారంలో..

-

క్రికెట్‌కు భారత‌దేశంలో ఫుల్ క్రేజ్ ఉంది. సెలబ్రిటీల నుంచి మొదలుకుని సామాన్యుల వరకు అందరూ క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. క్రికెట్ మ్యాచ్ నడుస్తుందంటే చాలు..రెప్ప వాల్చకుండా చూసేవారున్నారు. ఇక క్రికెట్ ఆడేవాళ్లు అయితే సువిశాల భారతదేశంలోని ప్రతీ గల్లీలో ఉంటారు. ప్రతీ ఒక్కరు సచిన్ టెండుల్కర్ లానే ఫీలవుతుంటారు. అయితే, కలలు కనడంలో తప్పు లేదు. కానీ, అందుకు తగ్గట్లు ఆచరణ ఉండటం ముఖ్యం. ప్రొఫెషనల్‌గా రాణించాలనుకునే వారు అయితే శ్రద్ధ వహించి క్రికెట్ ఆడాల్సిన అవసరముంటుంది. అవకాశం లభిస్తే చాలు.. ప్రూవ్ చేసుకోవాలి. కాగా, అలానే ప్రూవ్ చేసుకున్నాడు అసోంకు చెందిన ప్ర‌కాష్ భ‌గ‌త్ అనే ఆల్ రౌండ‌ర్. 2003లో గంగూలీతో క‌లిసి నేష‌న‌ల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆడాడు ప్రకాష్. అప్పట్లో ప్ర‌కాష్ భ‌గ‌త్ బౌలింగ్‌ స్టైల్‌ను చూసి గంగూలీ తెగ మెచ్చుకున్నాడు.

దాంతో తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని ప్రకాష్ భగత్ భావించాడు. 2009 నుంచి 2011 వ‌ర‌కు అసోం రంజీట్రోఫి జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా ఎదిగాడు ప్రకాష్. అయితే, 2011లో ప్ర‌కాష్ భ‌గ‌త్ తండ్రి మ‌ర‌ణించ‌డంతో కుటుంబ‌ భారం అతడిపై పడింది. దాంతో ప్రకాష్ తన ఫాదర్ నిర్వ‌హించిన పానీపూరీ వ్యాపారాన్ని నిర్వహించడం షురూ చేశాడు. ఇప్పటికీ అదే వ్యాపారాన్ని రోడ్డు పక్కన నిర్వ‌హిస్తున్నాడు ప్రకాష్. ఇక ఇప్పటికీ త‌న‌కు క్రికెట్ అంటే చాలా ఇష్ట‌మ‌ని ప్రకాష్ భగత్ పేర్కొంటుడటం గమనార్హం. అసోం రంజీలో త‌న‌తో పాటు ఆడిన పలువురు ఆటగాళ్లకు ప్ర‌భుత్వ ఉద్యోగాలు వచ్చాయని, కానీ, త‌న‌కు మాత్రం ఎలాంటి ఉద్యోగం రాలేదని ప్రకాష్ భగత్ వాపోతున్నాడు. కాగా ప్రకాష్ భగత్ లాంటి క్రీడాకారులు భారతదేశంలో చాలా మంది ఉన్నారని, వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిభ గల వారిని ప్రోత్సాహించాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news