ప్రత్తిపాటి పుల్లారావు 20 కోట్లు లంచం అడిగారు – వినుకొండ ఎమ్మెల్యే సంచలనం

-

గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి ప్రత్తిపాటి పుల్లారావు తనని రూ. 20 కోట్లు లంచం అడిగాడని సంచలన ఆరోపణలు చేశారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. తాను రెండు దశాబ్దాలుగా పారిశ్రామికవేత్తగా ఉన్నానని.. ఒక పారిశ్రామికవేత్తను ఏ ప్రభుత్వం వచ్చినా పారిశ్రామికవేత్తగానే చూడాలన్నారు. 2012లో గౌతమ బుద్ధా టెక్స్టైల్స్ కు టెండర్ వేసినట్లు తెలిపారు. టెండర్ ప్రకారమే డబ్బులు కట్టి.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు తెలిపారు.

కానీ అనుమతికి ప్రత్తిపాటి పుల్లారావు లంచం అడిగినట్లు ఆరోపించారు. తనని రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారు అనుకున్నానని.. కానీ ప్రత్తిపాటి పుల్లారావు అలా చేయలేదని అన్నారు. పార్టీ మారడంతో పాటు డబ్బు కట్టాలని ఒత్తిడి చేసినట్లు చెప్పుకొచ్చారు. వాళ్ల ఒత్తిడికి తలోగ్గనందుకే అనుమతులు రద్దు చేశారని ఆరోపించారు. తనని 20 కోట్లు అడిగారో లేదో మీరు ప్రమాణం చేస్తే.. నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news