రాష్ట్రపతి చెంత.. అవార్డుల పంట..!

-

హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం భారత అత్యున్నత క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఈ క్రారక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్.. ప్రతిష్ఠాత్మక అవార్డులైన ఖేల్​రత్న, అర్డున క్రీడాకారులకు అందించారు. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విజేతల పేర్లను చదవుతుండగా.. గ్రహీతలు అవార్డులను అందుకున్నారు. ఢిల్లీ, ముంబయి కోల్‌కతా, చండీగఢ్‌, బెంగళూరు, పుణె, సోనెపట్‌, హైదరాబాద్‌, భోపాల్‌లోని సాయ్‌ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ అత్యున్నత క్రీడా పురస్కారాలను అందుకోవటం పట్ల క్రీడాకారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మొత్తం ఈ ఏడాది అవార్డుల కోసం 74 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. ఇందులో 14 మంది అథ్లెట్లు వివిధ కారణాలతో వేడుకకు హాజరుకాలేకపోయారు. మిగిలిన 60 మంది ఈరోజు అవార్డుల్ని అందుకున్నారు.ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఈ వేడుకను రాష్ట్రపతి భవన్​లో నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల జరిగిన వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమానికి జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కార్యాలయాలు వేదికయ్యాయి. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చండీగఢ్‌, బెంగళూరు, పుణె, సోనెపట్‌, హైదరాబాద్‌, భోపాల్‌లోని సాయ్‌ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.​ రాష్ట్రపతి భవన్​ నుంచి రామ్​నాథ్​ కోవింద్ లైవ్​లో పాల్గొన్నారు.

ఖేల్ రత్నకు ప్రైజ్ మనీని మునుపటి రూ .7.5 లక్షల నుండి రూ .25 లక్షలకు పెంచారు. ఈ వేడుకకు హాజరైన 22 మంది అర్జున అవార్డు గ్రహీతలకు రూ .15 లక్షలు ఇచ్చారు, ఇది మునుపటి మొత్తంతో పోలిస్తే రూ .10 లక్షలు ఎక్కువ. ఇంతకుముందు 5 లక్షల రూపాయలు ఇచ్చిన ధ్రోనాచార్య (జీవితకాల) అవార్డు గ్రహీతలకు రూ .15 లక్షలు, సాధారణ ధ్రోనాచార్య అవార్డు గ్రహీతకు రూ .5 లక్షలకు బదులుగా రూ .10 లక్షలతో వచ్చారు. ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలకు రూ .5 లక్షలకు బదులుగా రూ .10 లక్షలు ఇచ్చారు.

భారత మాజీ అథ్లెటిక్ కోచ్ పురుషోత్తం రాయ్ (79) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు . ఈ సంవత్సరం ద్రోణాచార్య అవార్డులకు పురుషోత్తం రాయ్ పేరు ప్రకటించారు.

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు: రోహిత్ శర్మ (క్రికెట్), మరియప్పన్ తంగవేలు (పారా అథ్లెటిక్స్), మణికా బాత్రా (టేబుల్ టెన్నిస్), వినేష్ ఫోగట్ (రెజ్లింగ్), రాణి రాంపాల్ (హాకీ).

Read more RELATED
Recommended to you

Latest news