హనుమాన్ కి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని..!

-

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఆగస్టు 5న బుధవారం భూమి పూజ కార్యక్రమం చేపట్టడానికి ముహూర్తం పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్నో నుంచి అయోధ్యకు భారత వాయుసేన హెలికాప్టరులో వచ్చారు. అయితే బుధవారం ఉదయం ప్రధాని అయోధ్య నగరానికి చేరుకున్నారు. అయోధ్యకు చేరుకున్నాక ప్రధాని ముందుగా హనుమాన్ గర్హి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. మందిరంలో హనుమాన్ కి పూజలు చేసి హారతి ఇచ్చారు.

modi

ప్రధానమంత్రి మోదీ హనుమాన్ 10వ శతాబ్ధానికి చెందిన హనుమాన్ మందిరంలో పూజలు చేసిన మోదీ రాంలాలా స్థలానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు ఆలయంలో ఉండే భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటున్నారు. హనుమాన్ ఆలయంలో ప్రధాని మోదీ శిరసు వంచి నమస్కరించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డుల భారీ భద్రత మధ్య మోదీ సామాజిక దూరం పాటించారు. ఆలయంలో పూజలు చేసిన సందర్భంగా పూజారులు, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు కూడా దూరంగా ఉండి పోయారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ధరించిన ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version