మహేశ్ బాబు కొత్త మూవీలో అతడే విల‌న్‌.. ఇక స‌మ‌ర‌మే..!

-

మహేశ్ బాబు(mahesh babu)అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అప్ కమింగ్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికి కేవలం పోస్టర్ మాత్రమే విడుదలయింది. ఈ మూవీ పోస్టర్ తోనే అభిమానుల్లో విపరీతంగా అంచనాలు పెంచేసింది. పోస్టర్ లో మహేశ్ బాబు కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. అతడి మెడపై టాటూ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మహేశ్ బాబు/mahesh babu

ఇదిలా ఉండగా… సర్కారు వారి పాట మూవీ బ్యాంకింగ్ కుంభకోణాల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యేది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ టీం అంచనాలతో పాటు సూపర్ స్టార్ అభిమానుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి.

ఈ మూవీలో సూపర్ స్టార్ ను ఎదుర్కొనబోయే విలన్ ఎవరనేది ఎన్నటి నుంచో అభిమానుల మొదడ్లను తొలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆ రోల్ లో అర్జున్ కనిపిస్తారని ప్రచారం జరగ్గా… ప్రస్తుతం అది ఫేక్ అని తేలిపోయింది. అల వైకుంఠపురంలో, క్రాక్ సినిమాల్లో విలన్గా నటించి మెప్పించిన నటుడు, దర్శకుడు సముద్రఖని ని తీసుకుంటారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇటీవల సముద్రఖని నటించిన చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఆయన ఊపు మీద ఉన్నారు. ఈ మూవీలో మహేశ్ కు జోడీగా అందాల ముద్దు గుమ్మ కీర్తి సురేశ్ నటిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌, 14 రీల్స్‌ కలిసి నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version