కాంగ్రెస్ ఓటమి కోసం మూడు పార్టీలు కుట్ర: ప్రియాంక గాంధీ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి నేతృత్వన్లోని కాంగ్రెస్ గెలవడం దాదాపు సాధ్యమే అనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ కొన్ని విషయాలలో ప్రజల్లో నెగటివ్ అయిపోవడం, దాని తర్వాత రాష్ట్రానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కొనిపిస్తుండడమే ఇందుకు దోహదపడిన అంశాలు. ఈ రోజు హుస్నా బాద్ పర్యటనలో ప్రియాంక గాంధీ ప్రచారాన్ని నిర్వహించగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, BRS మరియు బీజేపీ ల మధ్య కాంగ్రెస్ ను ఓడించడానికి ఒక ఒప్పందం కుదిరింది అంటూ ఆరోపించింది. ఇక ఈ రెండు పార్టీలకు ఎంఐఎం పూర్తిగా సహకరిస్తోందంటూ ప్రియాంక చెప్పడం విశేషం. ఈ మూడు పార్టీలు తెలంగాణాలో కాంగ్రెస్ కు అధికారాన్ని దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నట్లు ప్రియాంక గాంధీ చెబుతోంది.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణాలో గెలిచేది కాంగ్రెస్ అంటూ ప్రియాంక గాంధీ ధీమాను వ్యక్తం చేసింది. మరి ఆమె కోరిక నెరవేరుతుందా లేదా కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version