మంత్రి సబితాకు నిరసన సెగ… రాజీనామా చేయాలంటూ నినాదాలు

-

వికారాబాద్ జిల్లా లోని పరిగి మార్కెట్ యార్డు లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి నిరసన సెగ తగిలింది. పరిగి మార్కెట్ కమిటీ చైర్మైన్ సురేందర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. ఈ నేపథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, బిసి బంధు ప్రకటించాలని కార్యక్రమం వద్ద నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు.

అయితే ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సబితా కి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వక పోవడం తో.. ఎమ్మెల్యే, మంత్రి పదవులకు సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే కొందరు కార్యకర్తలను అడ్డుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఓ వైపు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం.. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల నిరసనతో పరిగి మార్కెట్ యార్డు లో ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news