ప్రజా నాయకుడు ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి: ఎంపీ కేశినేని నాని

-

తెలంగాణ ముద్దు బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించడము పట్ల ఎంపీ కేశినేని నాని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామరావుకు కూడా  ‘భారతరత్న’ ప్రకటించాలని సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు వైసీపీ నేత కేశినేని నాని. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా రూ.2 కే కిలో బియ్యాన్ని ప్రజలకు అందజేసిన మహానేత సేవలను గుర్తించి ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించాలని ఆయన కోరారు. దేశంలో అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించుకోవడమే అయనకు ఇచ్చే నిజమైన నివాళి అని రాస్కొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news