రాజకీయాలు వదిలేస్తే గోవాలో ఎంజాయ్ చేస్తా: మల్లారెడ్డి

-

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.గోవాలో తనకు హోటల్ ఉందని, రాజకీయాల నుంచితప్పుకుంటే అక్కడికే వెళ్లి ఎంజాయ్ చేస్తానని అన్నారు.కేసీఆర్ కుటుంబంలో 3 పదవులు ఉన్నట్లేతమకూ ఉండాలనుకున్నామని మాజీ మంత్రి మల్లారెడ్డిచెప్పారు. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరినుంచి పోటీకి తన కుమారుడు భద్రారెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపణలపైనా మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని సెటైర్ వేశారు. ప్రెస్‌మీట్‌లో నా పేరు ఎత్తకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గుర్తింపు కోసమే జగ్గారెడ్డి తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ కోసం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కర్చీఫ్ వేశారని ,ఇది తెలిసి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. కేవలం చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news