పునీత్ కు అరుదైన గౌర‌వం ! ఆ అవార్డు కు ఎంపిక

-

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం ఇంకా ఆయ‌న అభిమానులను క‌లిచి వెస్తుంది. ఆయ‌న సాధించిన విజ‌యాల‌ను, ఆయ‌న చేసిన సేవ‌లను స్మ‌రించుకుంటు పునీత్ ను గుర్తు చేసుకుంటున్నారు. అయితే క‌ర్ణ‌ట‌క చెందిన మురుగు మ‌ఠ్ వారు పునీత్ కు అరుదైన గౌర‌వాన్ని అందించారు. ఈ ఏడాది కి గాను పునీత్ కు బ‌స‌వ శ్రీ అవార్డు ను అంద‌జేయ‌నున్న‌ట్టు మురుగు మ‌ఠ్ వారు తెలిపారు.

అయితే అతి చిన్న వ‌య‌స్సు లో అరుదైన గౌర‌వం అందుకొనున్న హీరో పునీత్ అని ప‌లువురు అభిమానులు అంటున్నారు. ఈ అవార్డును వ‌చ్చే ఏడాది ఆయ‌న జ‌యంతి రోజున అంద‌జేస్తామ‌ని మురుగు మ‌ఠ్ సంస్థ వారు తెలిపారు. ఈ అవార్డే కాకుండా పునీత్ కు క ర్న‌ట‌క ర‌త్న అవార్డు కూడా ఇవ్వ‌టానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని క‌ర్న‌ట‌క ముఖ్య మంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మై గ‌తం లో నే తెలిపారు. క‌ర్న‌ట‌క ర‌త్న క‌మిటీ తో చ‌ర్చించిన త‌ర్వాత దీని పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ముఖ్య మంత్రి బొమ్మై తెలిపారు. అయితే క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ తో అక్టోబ‌ర్ 29న ఆక‌స్మికంగా మ‌రణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news