వైసీపీ ఆఫ‌ర్‌పై.. పురందేశ్వరి క్లారిటీ..

-

బీజేపీ మహిళా నేత, వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరిని వైసీపీలో చేరాలంటూ ఆ పార్టీ అధిష్టానం ఒత్తిడి చేసిందంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆమె స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె మాట్లాడుతూ… గత ఎన్నికల ముందు వైసీపీలో చేరాలని తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సంప్రదింపులు జరగట్లేదని చెప్పారు.

‘నా భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడానికి ముందే నేను ఆ పార్టీలో చేరబోనని వారికి తెలిపారు’ అని పురందేశ్వరి చెప్పారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని తన భర్త స్పష్టంగా వైసీపీకి చెప్పారని వివరించారు. దీనికి వైసీపీ నేతలు అంగీకరించిన అనంతరమే తన భర్త, కుమారుడు ఆ పార్టీలో చేరారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news