పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ పై క్రేజీ అప్డేట్..

-

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం అంటేనే అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ముఖ్యంగా పూరి తీసే సినిమాలు యువతను బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఒక్కోసారి ఈయన దర్శకత్వంలో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చినట్టే మరోసారి దేవుడు చేసిన మనుషులు లాంటి డిజాస్టర్ కూడా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా పూరి దర్శకత్వం వహించిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పటికే చేతిలో ఉన్న పలు సినిమాలు క్యాన్సిల్ అయినట్టు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా పూరి జగన్నాథ్ కొత్త చిత్రం మొదలు కానుందని తెలుస్తోంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం టైగర్ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ పరాజయంతో విజయ్ తో పూరి తీస్తున్న జనగణమన చిత్రం కూడా ఆగిపోయింది. అనంతరం పూరి జగన్నాథ్ చిరంజీవితో ఒక సినిమా చేయనున్నారని వార్తలు వినిపించినప్పటికీ ఆ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో బాలకృష్ణతో ఓకే అయ్యిందని ప్రచారం జరిగింది కానీ అదీ కుదరలేదు. ఇక ఇవన్నీ కాదని తనకు మళ్ళీ హిట్ ఇచ్చిన రామ్ తోనే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయం కూడా పట్టాలెక్క లేనట్టే తెలిసింది. అయితే తాజాగా ఒక యంగ్ హీరోతో పూరి జగన్నాథ్ సినిమా ఓకే అయినట్టు తెలుస్తోంది.

 

కాగా ఆ యంగ్ హీరో మరెవరో కాదు విశ్వక్సేన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ రాసే కథలకు , క్యారక్టరైజేషన్ కు విశ్వ‌క్ సేన్ బాడీ లాంగ్వేజ్‌ ఫెరఫెక్ట్ గా సెట్ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నారని త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని వార్తలు సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయ్యే పనిలో ఉందని ఆగస్టు నుంచి ఈ సినిమా సర్టిఫైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి అసలు విషయం ఏంటి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news