శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పీవీ సింధు

-

టోక్యో ఒలిపింక్స్‌ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఇవాళ హైదరాబాద్‌ కు చేరుకుంది. కాసేపటి క్రితమే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పీవీ సింధు చేరుకుంది. ఈ సందర్భంగా పీవీ సింధుకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ మరియు సీపీ సజ్జనార్‌ ఘన స్వాగతం పలికారు. పీవీ సింధు రాక నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు.. కోలాహలం నెలకొంది.

కాగా…ఆగస్టు మాసం 1వ తేదీన కాంస్య పతకం కోసం జరుగిన ఒలింపిక్స్ లో పోటీలో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు అదరగొట్టింది. ఈ రసవత్తర పోరులో చైనా కు చెందిన ప్లేయర్ బింగ్జియావోపై పీవీ సింధూ అద్బుత విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతో తెలుగు తేజం పివి సింధు కాంస్యం గెలుచుకుంది. ఆ మ్యాచ్‌ లో జీయావో పై 21 -15, 21-13 తేడాతో రెండో సెట్ లోనూ పీవీ సింధు ఘన విజయం సాధించింది. ఇక విజయం అనంతరం ఇవాళే హైదరాబాద్‌ చేరుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news