ఉపాధి హామీ బిల్లుల స్కాం : జగన్‌ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌

-

అమరావతి : ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం ఇలా చేస్తే మేము చాలా సీరియస్ గా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉపాధి హామీ పథకం బిల్లులపై హైకోర్టులో ఇవాళ విచారణ చేపట్టింది. 1794 కోట్లకు గానూ, 413 కోట్లు చెల్లించాలమని ఈ సందర్భంగా హైకోర్టుకు అధికారులు వెల్లడించారు. కేవలం 43 కోట్లు మాత్రమే చెల్లించారని చెప్పారు డిఫెన్స్ న్యాయవాదులు.

అయితే దీనిపై పూర్తి డేటాతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పూర్తి డేటాతో అధికారులు ఎందుకు రాలేకపోతున్నారని నిలదీసీన హైకోర్టు.. హాజరు కావాలని చెప్పినా అధికారుల్లో ఒకరు ఎందుకు రాలేదని ప్రశ్నించింది. ఢిల్లీలో మీటింగ్ అని ఒకసారి, ఆర్బిట్రేషన్ అని మరోసారి సాకులు చెప్పడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చెప్పే సాకులు కౌంటర్ లో కూడా లేవని పేర్కొన్న ధర్మాసనం.. మీరు ఇలానే వ్యవహరిస్తే.. హైకోర్టు చాలా సీరియస్ గా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించింది. మీరు చెప్పే మాటలపై నమ్మకం పోయింది, అందువల్లే ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక ముందు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటామని.. ప్రతి బిల్లులో 20శాతం ఎందుకు మినహాయిస్తున్నారు.. మినహాయించిన డబ్బును ఎక్కడ ఉంచుతున్నారని నిలదీసింది. ఎటువంటి వివరాలు లేకుండా హైకోర్టుకు ఎందుకు వస్తున్నారని నిలదీసింది ధర్మాసనం. ఇక ఈ కేసును ఆగష్టు 18వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news