ప్రభాస్ లుక్ కు షాక్ అవుతున్న ఫ్యాన్స్… అసలేంటి ఇలా అయిపోయడంటూ..

-

ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన కొత్త సినిమా ‘ రాధేశ్యాం’  సినిమాతో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయనున్నాడు. తాజాగా ఈరోజు రాధేశ్యాం ట్రైలర్ విడుదల కాబోతోంది. దీని కోసం ప్రభాస్ హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరి వెళ్లాడు. శంషాబాద్ ఏయిర్ పోర్టులో మీడియా కెమెరాలు ప్రభాస్ క్లిక్ అనిపించాయి. తలపై నలుపు రంగు టాప్ తో చాలా కూల్ గా కనిపించాడు.

ఈరోజు విడుదలయ్యే ట్రైలర్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి రోమాంటిక్ లవ్ సినిమాగా ‘ రాధే శ్యాం’ రాబోతోంది. ఇప్పటికే సినిమాలోని పాటలు అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ హిట్ అయ్యాయి. ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతున్న రాధేశ్యాం ప్రమోషన్ల కోసం ముంబై, కొచ్చిన్, చెన్నై, ఢిల్లీ ఇలా ప్రధాన నగరాల్లోనూ కార్యక్రమాలు చేయబోతోంది మూవీ యూనిట్.

ఇదిలా ఉంటే ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అసలేంటి ప్రభాస్ ఇలా అయిపోయారేంటని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. గుబురు గడ్డం, విచిత్రమైన లుక్ తో ప్రభాస్ ఎయిర్ పోర్టులో నడుస్తుండటం చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. తమ హీరోలో మునుపటి షైన్ లేదని అనుకుంటున్నారు. స్టెరాయిడ్ల ప్రభావం ప్రభాస్ పై కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news