ప్చ్… అల్లీపూర్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్..!

-

రాయికల్ మండలం అల్లీపూర్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ జరిగింది. వివరాల లోకి వెళితే.. 6,7 వ తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది. చెప్పిన పని వినలేదని ఆరవ తరగతి విద్యార్థులను సీనియర్లు చితక్కొట్టారు. నలుగురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.

మొహంపై గాయాలు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా ఈ విషయం ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అధికారులు. నిన్నసెలవు కావటంతో చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు, మొహంపై గాయాలు కావడంతో బయటపడ్డ ర్యాగింగ్ వ్యవహారం బయటకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news