భారత్ జోడో యాత్రలో ‘ఛోటా రాహుల్’

-

భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో చేయి కలిపి ఓ యువకుడు చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అచ్చం రాహుల్​ని పోలి ఉన్న ఆ యువకుడు ఎవరంటూ ప్రస్తుతం నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఆ యువకుడి పేరు మహమ్మద్‌ ఫైసల్‌ చౌధరి (24). ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లా మవానా తహసీల్‌కు చెందిన యువరైతు. దూరం నుంచి చూస్తే రాహుల్‌ పోలికలతో కనిపించే ఫైసల్‌ను స్థానికంగా అందరూ ‘ఛోటా రాహుల్‌గాంధీ’ అని పిలుస్తారు.

కాంగ్రెస్‌ అభిమాని అయిన తండ్రి మరణానంతరం బీఏ చదువును సగంలో ఆపి వ్యవసాయం చేపట్టిన ఫైసల్‌.. భారత్‌ జోడో యాత్ర దిల్లీలో ఉండగా రాహుల్‌ బృందంతో జత కలిశారు. అగ్రనేతతో ఒక్క ఫొటో దిగాలన్న ఈ యువకుడి కోరిక జనవరి 12న తీరింది. యాత్రికులతో కలిసి నడుస్తుండగా రాహుల్‌ దృష్టిలో పడటంతో ఫైసల్‌ను దగ్గరకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news